పసర సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తూ ఇటీవల ఇన్స్పెక్టర్ గా ఆక్సిలరీ ప్రమోషన్ పొందిన జి.రవీందర్ నేడు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ను కలిశారు.
ములుగు జిల్లా పోలీస్ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ తన చేతుల మీదుగా నక్షత్రాన్ని అందించి ఇన్స్పెక్టర్ రవీందర్ ని అభినందించారు.
అనంతరం ములుగు సిసిఎస్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల అంకితభావం ప్రదర్శిస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పోలీస్ శాఖ కు మంచి పేరు తేవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ములుగు ఏ ఎస్ పి పోతరాజు సాయి చైతన్య, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్బిఐ ఇన్స్పెక్టర్ రెహమాన్ పాల్గొన్నారు.