31.7 C
Hyderabad
May 2, 2024 07: 08 AM
Slider విజయనగరం

విజయనగరం లో మరో అపచారం… అయ్యకోనేరు గట్టు వద్ద శివన్న విగ్రహం ధ్వంసం…!

#shivatemple

హిందువులపై నేరుగా దాడులు చేయక్కరలేదు…చారిత్రక ప్రాధాన్యత ఉన్న ,కలిగిన దేవాలయాలపై దాడి చేస్తే…యావత్ హిందూ సమాజం భయభ్రాంతులకు గురవుతుందన్న కించిత్ ఆలోచనతోనో లేక…తమ ఉనికి, ప్రాపకం కోసమో ఏమో గాని… విజయనగరం లో అతి ప్రాచీన,పురాతన ప్రాశస్తమైన అయ్యకోనేరు దక్షిణ గట్టు పై ఉన్న శివుని విగ్రహాన్ని కొందరు ద్వంసం చేసారు. గుడి లో శివుని చేతికున్న త్రిశూలం తెగిపడి ఉంది. అలాగే శివుని కుడి చెయ్యి కూడా.. విరిగినట్లు ఆధారాలు ప్రస్పుటంగా కనిపిస్తోంది.

అలాగే త్రిశూలం ను ధ్వంసం చేసి… ఆ ముక్కలను…ఆ గుడి లో మూలన పడేసారు… కొందరు దుండగులు. అయితే విజయనగరం నడిబొడ్డున…. దాసన్నపేట రైతు బజార్ సమీపంలో జరిగిన ఈ దుశ్చర్య…ఎవరు చేశారు…? లేక కావాలనే చేసారా… అన్నది తెలియాల్సి ఉంది. ఇటీవలే విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్.. తోటపాలెం బాలాజీ నగర్ లో శ్రీ వేంకటేశ్వర దేవాలయం వద్దే క్రైస్తవ మత ప్రచారం… ఆటోలి మైక్ లు ర్యాలీతో నిర్వహించి ఘటనపై తెలిసినదే. విషయం తెలుసుకున్న స్థానికులు… మత ప్రచార ర్యాలీ.. అందున హిందూ దేవాలయం వద్ద నిర్వహిస్తున్నారు…పోలీసులు అనుమతి ఉందా అని ప్రశ్నిస్తే..అక్కడ నుంచీ జారుకున్నారు.

తాజాగా అదే విజయనగరం నడిబొడ్డున మహారాణి పేట అయ్యకోనేరు వద్ద శివన్న ఆలయంలో జరిగిందీ అపచారం. ఇక విషయం తెలుసుకున్న హిందూ ధర్మ రక్షణ సమితి….”హిందూ ఆలయాలకు రక్షణ లేదా” అంటూ ఆందోళన కు దిగారు.

Related posts

ప్రజా సంక్షేమ కోసమే టి.ఆర్.యస్ పార్టీ

Satyam NEWS

మునుగోడు లో అభ్యర్డులకు గుర్తుల కేటాయింపు

Satyam NEWS

అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కో కన్వీనర్ గా మారెపల్లి నవీన్

Satyam NEWS

Leave a Comment