అక్రమ అరెస్ట్ లతో జూపల్లి అనుచరుల పోరాటాలను ఆపలేరని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన యంగంపల్లీ తాండ సర్పంచ్ గోపి నాయక్, ఎర్ర శ్రీనివాస్, ములే కుమార్ లు అన్నారు. తెల్లావారుజామున జూపల్లి వర్గానికి చెందిన పెంట్ల వెళ్లి మండల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈరోజు మంత్రి నిరంజన్ రెడ్డి పెంట్ల వెళ్లి మండల పర్యటన ఉన్నందున మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో యంగంపల్లి తాండ సర్పంచ్ గోపి నాయక్,ఔట ఎర్ర శ్రీనివాస్, ములే కుమార్ లు ఉన్నారు. వీరిని పెంట్ల వెళ్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు.