32.2 C
Hyderabad
May 13, 2024 22: 58 PM
Slider ఖమ్మం

రెండు వారాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు

#collector

రానున్న రెండు వారాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాట్లులో రాపిడ్ ప్రోగ్రెస్ రావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఎంపిడిఓలను ఆదేశించారు. ఐడిఓసి  కార్యాలయంలో డిపిఓ, డిఆర్డీఓ, జడ్పి సీఈఓ, ఎంపీడీఓ, ఎంపిఓ లతో పల్లె ప్రగతి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల వారీగా క్రీడాప్రాంగణాలు ఏర్పాటు ప్రక్రియను సమీక్షించిన ఆయన జిల్లాలో 800 పైగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాల్సి ఉందని,  క్రీడా ప్రాంగణాలు  ఏర్పాటు ప్రక్రియ పర్యవేక్షణకు జడ్పి సీఈఓ విద్యాలతను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు చెప్పారు. నిరంతరం పర్యవేక్షణతో లక్ష్యం పూర్తిచేయు విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  మోడల్ గా ఉండే విధంగా క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. హరితహారంలో మొక్కలు నాటేందుకు వారం రోజుల్లో నర్సరీలల్లో మొక్కలు పెంచడానికి చర్యలు చేపట్టాలని ఎంపీడీఓలను ఆదేశించారు.  సాచురేషన్ మోడులో ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తిచేయాలని చెప్పారు. నిర్మాణం పూర్తి అయిన మరుగుదొడ్లు వివరాలను రాష్ట్ర పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని చెప్పారు. నెల రోజుల్లో పెండింగ్ ఉన్న మరుగుదొడ్లు నూరు శాతం నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు.  ఓడిఫ్ ప్లస్ గా  ప్రకటించిన 378 గ్రామ పంచాయతీ ల్లో లిక్విడ్, సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పక్కాగా జరగాలని  చెప్పారు. ఎండాకాలంలో మొక్కల సంరక్షణ చాలా ముఖ్యమని ప్రతి శుక్రవారం మొక్కలకు నీళ్లు పోయాలని చెప్పారు.  మొక్కలు సంరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు.ఇంటి పన్నులు 412 పంచాయతీల్లో నూరు శాతం జరిగిందని లక్ష్యం పూర్తి చేసిన అధికారులను అభినందించారు.  69 గ్రామ పంచాయతీల్లో వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యర్థాల నుండి ఆదాయం సమకూరే విధంగా చర్యలు చేపట్టాలని, ఇప్పటి వరకు వ్యర్థాల ద్వారా  22 లక్షలు ఆదాయం సమకూరినట్లు చెప్పారు. ఆదాయం సమకూరని మండల ఎంపిఓలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కంటి వెలుగు కార్యక్రమాలు నిర్వహణకు ప్రజలను మొబలైజ్ చేయాలని చెప్పారు. కార్యక్రమం నిర్వహణకు మంచిగా ఏర్పాట్లు చేశారని అభినందించారు.

Related posts

జంపన్న వాగు వరద బాధితులకు సీతక్క సాయం

Satyam NEWS

రామతీర్థం… నీలాచలం కొండపై కొత్త విగ్రహాలు ప్రతిష్ఠ

Satyam NEWS

రాజకీయ కారణాలతోనే తాంత్రిక పూజ‌లు?

Satyam NEWS

Leave a Comment