తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే నియమితులయ్యారు. జస్టిస్ అలోక్ అరాధే ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు జడ్జిగా ఉన్నారు. జస్టిస్ సామ్ కొశాయ్ తెలంగాణ హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఛత్తీస్గఢ్ హైకోర్టు జడ్జిగా ఉన్నారు.
ఈనెల 5న పలువురు జడ్జిల బదిలీలకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కొలీజియం సిఫారసు చేసిన వారిలో ఐదుగురు జడ్జిల బదిలీకి కేంద్రం ఆమోదం తెలిపింది.