కరోనా మహమ్మారి మరో సీనియర్ జర్నలిస్టును పొట్టనపెట్టుకుంది. కడప జిల్లా ఎన్ టి వి రిపోర్టర్ గా పని చేస్తున్న మధుసూదన్ రెడ్డి కరోనా చికిత్స పొందుతూ మరణించారు. కడప నగరంలో ఉండే మధుసూదన్ రెడ్డి విధినిర్వహణలో ఉండగానే కరోనా సోకింది.
శ్వాస తీసుకోవడానికి అతను ఇబ్బంది పడుతున్న సమయంలో కడప లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ తనకు సరైన చికిత్స లభించడం లేదని మధుసూదన్ రెడ్డి సెల్ ఫోన్ మెసేజీ ద్వారా ఫిర్యాదు చేశారు. దాంతో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని అతడిని తిరుపతి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగానే మరణించాడు.