ఒంగోలు డబ్బులు చెన్నైలో పట్టుపడిన సంఘటన మరుమక ముందే నంద్యాల టోల్ గేట్ వద్ద పోలీసులకు భారీ మొత్తంలో నగదు దొరికింది. హైదరాబాద్ నుండి కోయంబత్తూర్ కు కారులో ఈ డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో (1.80) కోటి ఎనభై వేల రూపాయల నగదు దొరికింది.
దాంతో ఈ మొత్తాన్ని పాణ్యం పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన డబ్బును ఇన్ కం టాక్స్ అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బు తరలిస్తున్న దత్తాత్రేయ విఠల్ ను విచారించగా హైదరాబాద్ నుండి కోయంబత్తూర్ కు హాస్పిటల్ కు ఈ డబ్బును తరలిస్తున్నట్లు విచారణలో తెలిపినట్లు పాణ్యం CI జీవన్ గంగానాధ్ బాబు వెల్లడించారు.