కర్నూలు నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన రేంజ్ పోలీసు డ్యూటీ మీట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి ఓవరాల్ ఛాంపియన్ గా అవతరించింది. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ పతకాలు, షీల్డులు సాధించి జిల్లా పోలీసు ప్రతిష్టను మరింతగా ఇనుమడింపచేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. మున్ముందు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
పోలీస్ డ్యూటీ మీట్ లో ట్రాకర్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన డాగ్ స్క్వాడ్ లోని జాగిలం ‘డాన్’ కు డాగ్ హ్యాండ్లర్ లుగా ఉన్నఆర్.ఆర్.మోహన్ రెడ్డి (ARPC 328), డి.శ్రీనివాసులు (ARPC 2991), స్నిఫర్ జాగిలాల విభాగంలో రెండో స్థానంలో నిలిచిన ‘వాగా’ జాగిలం హ్యాండ్లర్లుగా ఉన్న డి.పీరయ్య (ARPC 2342), జె.శివకుమార్ (ARPC 3005) లు, ప్రథమ స్థానంలో నిలిచిన బాంబ్ డిస్పోజల్ టీమ్ లోని బి.వెంకటేశ్వర్లు(ARPC 2260), జి.ప్రసాద్ (ARPC 3017) లను ఎస్పీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పి (ఆపరేషన్స్) ఎం.దేవప్రసాద్, స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అదనపు ఎస్.పి కే.చక్రవర్తి, ఏ.ఆర్ అదనపు ఎస్.పి ఆర్.రిషికేశవ రెడ్డి, ప్రొద్దుటూరు డి.ఎస్.పి వై. ప్రసాద రావు, ఫ్యాక్షన్ జోన్ డి.ఎస్.పి చెంచుబాబు, ఎస్.బి ఇన్స్పెక్టర్ కే.పుల్లయ్య, ఆర్.ఐ లు వి. శ్రీనివాసులు, ఎస్. మహబూబ్ బాషా, జార్జి, మధు, సిబ్బంది పాల్గొన్నారు.