సీఎం జగన్ తన చిన్నాన్న హత్య అంశంపై సాక్షాత్తు సీబీఐ నే అనుమానం వ్యక్తం చేస్తోందని… అందుకు వైఎస్ వివేకా..బిడ్డ ఇచ్చిన సాక్ష్యం పైనే పోలీసు అధికారులు దృష్టి పెట్టారని విజయనగరం తెలుగు దేశం పార్టీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లాలో “జగనాసుర రక్తచరిత్ర”..పుస్తకాన్ని టీడీపీ నేతలైన ఐవీపీ రాజు ,ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్ తదితరులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ…. వైఎస్ వివేక..హత్య కేసులో నిజానిజాలు తేలాల్సి ఉందన్నారు.అసలు జగన్ ప్రభుత్వ హయాంలోనే హత్య కం పధకాలు… ప్రోద్బలాలు జరుగుతున్నాయన్నారు.అసలు జగన్ హాయాంలో ఏం జరుగుతుందో తెలియజెప్పే చర్యలే…ఈ “జగనాసుర రక్తచరిత్ర” పుస్తక ఆవిష్కరణ అని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు.
విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ లో యాభై డివిజన్ లలో ఈ పుస్తకాలను పార్టీ పంపిణీ చేసి…జగన్ పాలన ఏలా ఉందో తెలియచేస్తామని టీడీపీ నగర అధ్యక్షుడు ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్ తెలిపారు.