అంబర్ పేట డివిజన్ నరేంద్ర నగర్ లో 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే నరేంద్ర నగర్ లో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, నరేంద్ర నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న షెడ్డు నిర్మాణ పనులను స్థానికులతో కలిసి పరిశీలించి,
పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే నరేంద్ర నగర్ లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించగా అక్కడి ప్రజల కోరినట్లు ఆలయ విస్తరణ, పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. అలాగే కాలనీలో వీధి దీపాలను ఏర్పాటు చేయాలని, డ్రైనేజీ సంబంధిత సమస్యలు
ఉన్నాయని, విద్యుత్ వైర్లను సరి చేయించాలని తెలుపుగా ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ, సువర్ణ, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గా, వాటర్ వర్క్స్ ఏఈ మాజీద్, ఎలక్ట్రికల్ డీఈ రమణా రెడ్డి, ఏఈ శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సిద్దార్థ్ ముదిరాజ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, స్థానిక బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట