సిబిఐటి కళాశాల లో మొదటి సంవత్సరం విద్యార్థులు కోసం స్టూడెంట్ ఇండక్షన్ కార్యక్రమంలో భాగంగా కళాశాల అధ్యాపకులు మరియు మొదటి సంవత్సరం విద్యార్థులు వివిధ రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి వి నరసింహులు మాట్లాడుతూ సకల జీవరాశులను సంరక్షించుకోవడం కోసం మనం మంచి చెట్లు నాటాలని సూచించారు. మనకు చెట్లు వాతావరణంలో ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడానికి, అవి సిఓ2 స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. మనందరికీ తెలిసినట్లుగా, ప్రపంచం మొత్తం గ్లోబల్ వార్మింగ్ సమస్యను ఎదుర్కొంటోంది. ఆ సమస్య నుండి కోలుకోవడానికి చెట్లను నాటడం అనేది నేడు అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటిగా మారిందని ఈ కార్యక్రమ నిర్వాహకుడు ప్రొఫెసర్ బి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇతర అధ్యాపకులు ప్రొఫెసర్ పి వి ఆర్ రవీందర్ రెడ్డి రెడ్డి, డాక్టర్ నట్టువ నటరాజు, కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ కె రమేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మహేశ్వర్ రెడ్డి మరియు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.
previous post