ఈ నెల 26న దేశ గణతంత్ర దినోత్సవం జరగనున్న సంగతి ప్రతీ ఒక్కరికీ తెలిసినదే. ఈ వేడుకలు దేశ వ్యాప్తంగా జరుగుతున్న వేళ..ప్రతీ రాష్ట్రంలో గవర్నర్.. జిల్లా ల్లో కలెక్టర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ క్రమంలో విజయనగరం లో పరేడ్ మైదానంలో ఈ రిపబ్లిక్ వేడుకలకు మైదానం సిధ్ధమైంది.ఈ ఏర్పాటు ను ఆర్.డీ.ఓ సూర్య కళ…ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారు.పలు ప్రభుత్వ శాఖలు ప్రగతిని ప్రతిబింబించే విధంగా శకటాల ను ప్రదర్శించ నున్నాయి.
ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను కూడా బహూకరించనున్నారు. పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. గణతంత్ర వేడుకల ఏర్పాట్లను రెవెన్యూ డివిజన్ అధికారి ఎం.వి.సూర్య కళ, తహశీల్దార్ బంగార్రాజు తదితరులు పర్యవేక్షించారు.