గోల్నాక డివిజన్ మాజీ కార్పొరేటర్ కాలేరు పద్మావెంకటేష్ నల్లకుంట డివిజన్ విద్యా నగర్ లోని అనాధ ఆశ్రమంలో గల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వంట చేసి మధ్యాహ్న భోజన సమయంలో వారికి స్వయంగా వడ్డించారు. కాలేరు పద్మావెంకటేష్ ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు.
గత కొన్నేళ్లుగా వారు ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతూ సేవకు, ఆప్యాయతకు మారుపేరుగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కాలేరు పద్మావెంకటేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, ఆశ్రమం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట