33.2 C
Hyderabad
May 15, 2024 20: 40 PM
Slider హైదరాబాద్

అనాథాశ్రమంలో వంటచేసి పిల్లలకు వడ్డించిన కాలేరు పద్మ

#Kaleru Padmavenkatesh

గోల్నాక డివిజన్ మాజీ కార్పొరేటర్ కాలేరు పద్మావెంకటేష్ నల్లకుంట డివిజన్ విద్యా నగర్ లోని అనాధ ఆశ్రమంలో గల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వంట చేసి మధ్యాహ్న భోజన సమయంలో వారికి స్వయంగా వడ్డించారు. కాలేరు పద్మావెంకటేష్ ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు.

గత కొన్నేళ్లుగా వారు ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతూ సేవకు, ఆప్యాయతకు మారుపేరుగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కాలేరు పద్మావెంకటేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, ఆశ్రమం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

క్రైస్తవ సోదర సోదరీమణులకు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ కానుక

Satyam NEWS

కొండను తవ్వి ఎలుకలు పడుతున్న కాంగ్రెస్ నాయకులు

Satyam NEWS

ముగిసిన డేటా విజువలైజేషన్ సంబంధిత అంశాల సదస్సు

Satyam NEWS

Leave a Comment