ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ క్రిస్మస్ పండుగ అని జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్ పెట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం క్రైస్తవ సోదరులు ఎస్.వి.ఆర్ ఫంక్షన్ హాల్ లో క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ మత పెద్దలు చంద్రమౌళి, రాజు ఏర్పాటుచేసిన విందు భోజనానికి, ముఖ్య అతిథిగా హాజరైన కేక్ కట్ చేసి, క్రైస్తవ సోదర సోదరీమణులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న క్రిస్మస్ కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, టిఆర్ఎస్ పార్టీ అంబర్ పేట్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, జనరల్ సెక్రెటరీ జాఫర్, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు లవంగు ఆంజనేయులు, ఆమనూరి సతీష్, సలీం తదితరులు పాల్గొన్నారు.