సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మండలం వారిగా 120 మంది లబ్ధిదారులకు చెక్కు లు పంపిణీ చేశారు.
ఈసందర్భంగా సైది రెడ్డి మాట్లాడుతూ CM కేసీఆర్ దేశంలో లేనటువంటి అనేక పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారని అన్నారు.రైతులకు 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు భీమా, గొల్ల కురుమలకు గొఱ్ఱెల పంపిణీ, మొదలైన అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు తీసుకువచ్చి ప్రతి కుటుంబానికి పెద్దన్న లాగా ఉన్నారని,ఆడపిల్లల కుటుంబానికి భారం కాకూడదని ఆడపిల్ల ఉన్న కుటుంబం పెళ్లి చేయాలంటే ఎన్ని కష్టాలు పడాలో తెలిసిన వ్యక్తిగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు తేవడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో MPP పెండం సుజాత శ్రీనివాస్ గౌడ్, హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, ZPTC పోరెడ్డి శైలజ, రవీందర్ రెడ్డి, సర్పంచ్ త్రిపురం సీతారాంరెడ్డి, ఎమ్ పి టి సి కడియం స్వప్న వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జోగు అరవింద్ రెడ్డి, తాసిల్దార్ అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు లబ్ధిదారులు పాల్గొన్నారు.