ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేరు వేరు రాష్ట్రాలు కదా? ఎవరు చెప్పారండీ రెండూ ఒకటే. నిజమా?
అవును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలంగాణ ప్రభుత్వ లోగోను వాడి ఈ విషయాన్ని రుజువు చేశారు.
అసలు విషయం ఏమిటంటే పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవం గురించి ఇచ్చిన ప్రకటనలో తెలంగాణకు చెందిన ఓ గ్రామ పంచాయతీ భవనం ఫొటో వేశారు.
అందులో తెలంగాణ ప్రభుత్వం లోగో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ క్రమంలో ఏపీ సర్కార్పై విపక్షాలు సెటైర్లు వేస్తున్నారు.
ఏపీలో ఒక్క గ్రామ పంచాయతీ ఫొటో కూడా మీకు దొరకలేదా..? అని ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణ ఫొటోను వేస్తారా? అని ఏపీ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు.
ఏ ఫర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలూ ఒకటే కదా అని మరి కొందరు ఎద్దేవా చేస్తున్నారు.