ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కళ్ళచెరువు నుండి జలపావారి గూడెం మీదగా కామవరపు కోట వెళ్లే పంచాయతీ రాజ్ రహదారి కితూట్లు పడి 20 ఏళ్ళు గడిచిపోతున్నాయి.రాజకీయ తరాలు మారినా రహదారుల తలరాతలు మారలేదనడానికి ఇటువంటి రహదారులు ఉదాహరణలు గా రుజువు చేస్తున్నాయి.
ఇదే మండలం లో గద్దె వారి గూడెం నుండి జీలకర్ర గూడెం వెళ్లే రహదారి .పొలాసి గూడెం నుండి ఆసన్నగూడెం వరకు ఉన్న రహదారి పరిస్థితి కూడా అద్వాన్నం గా మారి చాలా ఏళ్ళయింది.ఏ పాపం చేసుకున్నామో గాని పాలకులకు మా గ్రామాల రహదారుల దుస్థితి కనిపించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు