ఎంసెట్, ఈసెట్, లాసెట్, పీజీసెట్, ఐసెట్, ఎడ్సెట్, పీజీఈ సెట్కు సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన పరీక్షా తేదీలను అధికారులు ప్రకటించారు. మే 7 నుండి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్,12 నుంచి 14 వరకు అగ్రికల్చర్- ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఎడ్సెట్ను మే 18న,ఈసెట్ను మే 20న, లాసెట్(ఎల్ఎల్బీ) మే 20న, మే 20న పీజీఎల్ సెట్ (ఎల్ఎల్ఎం), మే 26 నుంచి 27 వరకు పీజీ ఐసెట్,మే, 29 నుంచి జూన్ ఒకటి వరకు పీజీ ఈసెట్ను జరుగనున్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర వివరాలతో వివరణాత్మక నోటిఫికేషన్ను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని మంత్రి సబిత పేర్కొన్నారు
previous post