కమ్మ సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని , ఉప్పల్ నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ పార్టీనీ భారీ మెజారిటీతో గెలిపించాలని బండారి లక్ష్మారెడ్డి అభ్యర్ధించారు. మీర్ పేట్ హౌసింగ్ బోర్డు డివిజన్ లో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, గడ్డిపాటి వెంకటేశ్వర రావు (చిన్న), శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్మ సంఘం ఆత్మీయ సమావేశానికి ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మేల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా గడ్డిపాటి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా తక్షణమే స్పందించి అక్కడికక్కడే పరిష్కరించే గొప్ప మనసున్న వ్యక్తి, ఉప్పల్ నియోజకవర్గానికి ఎమ్మేల్యేగా ఉంటే అందరికి మంచి జరుగుతుందని అన్నారు. ఈ మేరకు కమ్మ సంఘ సభ్యులందరూ కలిసి బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి బండారి లక్ష్మారెడ్డి నీ భారీ మెజారిటీతో గెలిపిస్తామని తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉప్పల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని అన్యాయంగా అరెస్ట్ చేశారని, గతంలో మీడియా ముఖంగా 3 సార్లు ఖండించానని గుర్తుచేశారు.
కేసీఅర్ కమ్మ సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తూ, కమ్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అరికెపూడి గాంధీ ఆధ్వర్యంలో హైటెక్ సిటీ, ఖానా గూడ ప్రాంతంలో తెలంగాణ కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్య వారికి దాదాపు 300 కోట్లు విలువ చేసే 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారని గుర్తుచేశారు. తెలంగాణలో కేసీఅర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి మీ కళ్లముందే ఉందని, అభివృద్ధి చేసిన పార్టీకి పట్టం కట్టాలనీ ఉప్పల్ నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ పార్టీనీ భారీ మెజారిటీతో గెలిపించాలని బండారి అభ్యర్ధించారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా