38.2 C
Hyderabad
April 29, 2024 19: 55 PM
Slider నిజామాబాద్

ప్రజలను వంచించిన ఎమ్మెల్యేకు ప్రజలే బుద్ది చెప్తారు

#congress

ప్రజల చందాలతో గెలిచిన ఎమ్మెల్యే సురేందర్ ప్రజలనే  వంచించారని, అలాంటి ఎమ్మెల్యేకు ప్రజలే బుద్ది చెప్తారని ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ మోహన్ రావు అన్నారు. నేడు నాగిరెడ్డిపేట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వెళ్లిన మదన్ మోహన్ రావుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామాల్లో ఘనస్వాగతం పలికారు. ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలు వింటూ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ రావు మాట్లాడుతూ.. ఐదేళ్లు పదవిలో ఉన్న ఎమ్మెల్యే గ్రామాల సమస్యలను, ప్రజల కష్టాలను విస్మరించారన్నారు. బీఆర్ఎస్ పాలన సర్వం అవినీతిమయమైందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలతో అన్ని వర్గాలకు సంక్షేమం సుస్థిర పాలన అందుతుందని భరోసా ఇచ్చారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

జర్నలిస్ట్ భగీరధకు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం

Satyam NEWS

ముంబయిలో విదేశీ కరెన్సీ పట్టివేత..

Bhavani

ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యే అటు కేంద్ర మాజీమంత్రి

Satyam NEWS

Leave a Comment