కెసిఆర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ కేసీఆర్ కారణజన్ముడిగా.. చిరస్మరణీయుడుగా..
ప్రజల తల రాతలు మార్చే మహానియుడుగా..మహా నాయకునిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలి.. పార్టీ కార్యకర్తలు, ఉద్యమ కారుల మధ్య నేడు జన్మదిన వేడుకలు నివహిస్తున్నం. కెసిఆర్ ఈ మట్టి బిడ్డా కావడం గర్వకారణం. తెలంగాణ రాష్ట్రం సాధించిన కారణ జన్ముడు కెసిఆర్. కానే కాదు, రానే రాదు అన్న తెలంగణా రాష్ట్రాన్ని కెసిఆర్ సాధించాడు.
రైతు బందు, బీమా పథకాలు దేశానికి ఆదర్శం. తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవం తో బ్రతికేలా కెసిఆర్ కృషి చేశాడు. 65వేల కోట్లు రైతు బందు కోసం బడ్జెట్ లో పెట్టాడు కెసిఆర్. అభివృద్ధి లో సంక్షేమం లో తెలంగాణ ను కెసిఆర్ ముందుచాడు అని ఆయన అన్నారు.