కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి నుంచే విద్యార్ధులు ప్రిపేర్ కావడానికి ప్రముఖ శిక్షణా సంస్థలతో కలిసి ఐఐటీ-జేఈఈ ఫోరం ఆన్ లైన్ టెస్టుల ప్రోగ్రాం ప్లాన్ చేసింది. ప్రముఖ ఐఐటీ శిక్షణా సంస్థలు ఐఐటీ-జేఈఈ ఫోరం సంయుక్తంగా రూపొందించిన బిట్ శాట్, NTSE -2 ఆన్ లైన్ మోడల్, మోక్ టెస్ట్స్ లో విద్యార్థుల కు ఉచితంగా అందచేస్తున్నట్లు ఐఐటీ -జేఈఈ/నీట్ ఫోరం కన్వీనర్ కె. లలిత్ కుమార్ తెలిపారు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో లో ఇంటి వద్ద విద్యార్థుల ప్రేపరషన్, ప్రాక్టీస్ కోసం ఇది ఉపయోగపడుతుందని ఆయన సత్యం న్యూస్ కు తెలిపారు. ఔత్సాహిక విద్యార్థుల అవగాహన కోసం మొబైల్ వెర్షన్ ద్వారా ఆన్ లైన్ లింక్ ను వాట్సాప్ ద్వారా నేటి నుండి అందిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఆసక్తి గల వారు 98490 16661 కు ‘ BITSAT’ అని, NTSE వారు NTSE టైప్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయాల్సిందిగా ఆయన కోరారు.