39.2 C
Hyderabad
May 4, 2024 19: 16 PM
Slider ముఖ్యంశాలు

రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలి: కాట్రగడ్డ ప్రసూన

#katragaddaprasuna

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య దివంగతులు కావడం విచారకరమని మాజీ శాసనసభ్యురాలు, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పాలనాపరమైన అంశాలపై సాధికారత కలిగిన నేత ఆయన అని అన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా అత్యధిక కాలం పని చేసిన రోశయ్య కు క్షేత్ర స్థాయిలో ప్రజల సాధకబాధకాల గురించి, వారి సంక్షేమానికి సంబంధించిన నిధుల వ్యయం గురించి ఎంతో అవగాహన ఉండేదని ఆమె గుర్తు చేస్తుకున్నారు. ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లో తన రాజకీయ, పాలన అనుభవాన్ని చూపారని, తను తీసుకున్న ఏ బాధ్యతనైనా సమర్థంగా నిర్వర్తించారని ప్రసూన అన్నారు.

Related posts

ఇంటి ఇంటిలో నరేంద్ర మోడీ ఫొటో పెట్టుకునే స్థితి వచ్చింది

Satyam NEWS

విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించండి

Satyam NEWS

దోచుకో నా రాజా: నకిలీ పత్తి విత్తనాల వెల్లువ

Satyam NEWS

Leave a Comment