37.7 C
Hyderabad
May 4, 2024 11: 06 AM
Slider రంగారెడ్డి

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కేసీఆర్ జన్మదినం

#TandurMLA

బంగారు తెలంగాణ నిర్మాత ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు తాండూరు నియోజకవర్గంలో సంబురంగా జరిగాయి. తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రక్తదానం చేశారు.

ఎమ్మెల్యే స్ఫూర్తితో స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, యంగ్ లీడర్స్ సభ్యులు రక్తదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకెళ్తున్నారని అన్నారు.

అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోనే ఆదర్శం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స్వప్న  మున్సిపల్ వైస్ చైర్ పర్సన్  దీపా  మార్కెట్ కమిటీ చైర్మన్  విట్ఠల్ నాయక్,   ఎమ్మెల్యే తండ్రి సీనియర్ నాయకుడు విట్టల్ రెడ్డి, నాయకులు , మురళి కృష్ణ, నర్సింలు రాజన్ గౌడ్, జావిద్,     బషీరాబాద్, తాండూరు సర్పంచుల సంఘము అధ్యక్షులు  తదితరులు ఉన్నారు.

Related posts

న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్న సైరా

Satyam NEWS

వలస కూలీ వరస…

Satyam NEWS

దాతృత్వాన్ని చాటుకున్న సిరిపురం విశ్వనాథం

Satyam NEWS

Leave a Comment