సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం నిర్మించిన భోజన శాలను బుధవారం దాత సిరిపురం విశ్వనాథం ప్రారంభించారు.
ఈ సందర్భంగా దాతను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దాత సిరిపురం విశ్వనాథం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల సౌకర్యం కోసం 1,20,000 రూపాయల వ్యయంతో ఈ నిర్మాణం చేశామని తెలిపారు.
ఇది తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. స్థానిక ఆర్య వైశ్య సంఘ అధ్యక్షుడు వంగవీటి హనుమంతరావు మాట్లాడుతూ దాత ఈ పాఠశాలకే కాకుండా పట్టణంలోని మరి కొన్ని పాఠశాలలకు కూడా సహాయాన్ని చేసి తన దాతృత్వాన్ని చాటు కోవడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మల్లెల ఉదయశ్రీ, ఉపాధ్యాయులు శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, మాతంగి ప్రభాకరరావు, ప్రసన్న, దినారాణి, శేషగిరి, సుజాత, అశ్విని, జనార్దన్ రెడ్డి, వసంతరావు, రవీందర్ రెడ్డి, గమానియేలు, విద్యార్థులు పాల్గొన్నారు.