26.7 C
Hyderabad
May 3, 2024 07: 14 AM
Slider నల్గొండ

దాతృత్వాన్ని చాటుకున్న సిరిపురం విశ్వనాథం

#SuryapetHighSchool

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం నిర్మించిన భోజన శాలను బుధవారం దాత సిరిపురం విశ్వనాథం ప్రారంభించారు.

ఈ సందర్భంగా దాతను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దాత సిరిపురం విశ్వనాథం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల సౌకర్యం కోసం 1,20,000 రూపాయల వ్యయంతో ఈ నిర్మాణం చేశామని తెలిపారు.

ఇది తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. స్థానిక ఆర్య వైశ్య సంఘ అధ్యక్షుడు వంగవీటి హనుమంతరావు మాట్లాడుతూ దాత ఈ పాఠశాలకే కాకుండా పట్టణంలోని మరి కొన్ని పాఠశాలలకు కూడా సహాయాన్ని చేసి తన దాతృత్వాన్ని చాటు కోవడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మల్లెల ఉదయశ్రీ, ఉపాధ్యాయులు శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, మాతంగి ప్రభాకరరావు, ప్రసన్న, దినారాణి, శేషగిరి, సుజాత, అశ్విని, జనార్దన్ రెడ్డి, వసంతరావు, రవీందర్ రెడ్డి, గమానియేలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ లో విద్య క్యాలెండర్ విడుదల చేయాలి

Satyam NEWS

రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదు

Bhavani

రాజకీయ పార్టీలు మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టవద్దు

Satyam NEWS

Leave a Comment