కేంద్రం ఇస్తున్న నిధులతో ప్రాజెక్టులు చేపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక అసమర్థ ముఖ్యమంత్రి అని బీజేపీ నేత డి కే అరుణ అన్నారు. ముఖ్యమంత్రి గద్వాల పర్యటన అట్టర్ ప్లాప్ అయిందని జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లా కేంద్రం గద్వాల్ లో మీడియాతో మాట్లాడుతూ ఆమె చెప్పారు. కృష్ణా నీళ్లు వాడుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి కేసిఆర్.
అప్పుడు ఆంధ్ర-తెలంగాణ మధ్య చిచ్చు, ఇప్పుడు ఉత్తర తెలంగాణ-దక్షిణ తెలంగాణ మధ్య చిచ్చు. తెలంగాణను దోచుకున్న ముఖ్యమంత్రి ఇప్పుడు దేశాన్ని దోచుకోవాలని కలలు కంటున్నారు అని ఆమె అన్నారు.
కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతున్నదని ఆమె స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి పార్టీ మీటింగ్ వచ్చిన ప్రజలకు గొడ్డుకారం పెట్టినరు ! రాష్ట్రం అభివృద్ధి జరిగిందంటారా మిస్టర్ కెసిఆర్. గద్వాల్ మెడికల్ కాలేజ్ ఎందుకు ఇవ్వలేదు అని ఆమె ప్రశ్నించారు.
గద్వాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏమైంది? గతంలో ఇచ్చిన హామీలకే దిక్కులేదు కొత్తగా మీరిచ్చిందేంటి ? గద్వాల్ జిల్లా గాని ఉమ్మడి పాలమూరు జిల్లాకు గాని మీరు చేసిన అభివృద్ధి ఎక్కడుందో చూపించండి అక్కడికి మేము వస్తాము అని ఆమె సవాల్ విసిరారు.