భిన్నత్వంలో ఏకత్వం ఇదే దేశ ప్రగతికి మూలమంత్రం అన్న నినాదంతో ముందుకు వెళ్తున్న ఘనచరిత్ర కలిగిన దేశంలో పౌరసత్వ సవరణ బిల్లు చిచ్చుపెడుతున్నదని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు.
పార్లమెంట్ లో పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేయడం పై విజయవాడలో ముస్లిం ప్రజా సంఘాలు నేడు ధన్యావాదాలు తెలిపాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో నాని మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని ఈ బిల్లు కాలరాస్తున్నదని అన్నారు.
కులాలకు మతాలకు వ్యత్యాసం చూడకుండా అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుందని కానీ దానికి వ్యతిరేకంగా తీసుకొని వచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు మంచిది కాదని ఆయన అన్నారు. ఈ అభినందన కార్యక్రమంలో విజయవాడ ఆటోనగర్ అసోసియేషన్ సభ్యులు ఫత్ ఉళ్ళ, ముజాహిద్, హబీబ్ రియాజ్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఇక్బాల్, మౌలానా మక్బూల్, న్యాయవాది మతిన్, మొహిద్దిన్, జబీ, ఫిరోజ్, డాక్టర్ రెహమాన్, మౌలానా హుస్సేన్, జమాతే ఇస్లామి హింద్, జమీయతే ఉలేమా ఏ హింద్ ప్రతినిధులు, భారీఎత్తున మహిళలు సైతం పాల్గొన్నారు.