గణాంక దర్శిని 2021-22 పుస్తకాన్ని కలెక్టర్ వి.పి.గౌతమ్ ఐడిఓసి సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక ప్రణాళిక విధాన,రూపకల్పనలో ముఖ్యమైనదన్నారు. రోజువారరి జీవితంలో వాడకం, విధానాలు రూపొందించడంలో గణాంకాలుదోహదపడతాయన్నారు.
జిల్లా గణాంక దర్శినిలో జనాభా, వాతావరణం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, విద్య, రవాణా, నీటి వనరులు, పంటలు, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఫైనాన్స్, లోకల్బాడి, ఇండస్ట్రీస్ సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు వివరంగా ఉంటాయని తెలిపారు. గణాంక దర్శినిలో అన్ని శాఖల జిల్లా గణాంక వివరాలు పొందుపరుస్తారని కలెక్టర్ తెలిపారు.
కార్య క్రమలో స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ రాధికా గుప్తా, డి అర్ ఓ శిరీష, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.