ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శివైక్యం పొందడం బాధాకరమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర అన్నారు. బాలు మరణం సంగీత ప్రపంచానికే తీరని లోటని ఆయన అన్నారు.
సంగీతమే ఊపిరిగా బాలు జీవించారని, విశాఖ శ్రీ శారదాపీఠంతో ఆయనకు మంచి అనుబంధం ఉందని స్వరూపానందేంద్ర అన్నారు.
శ్రీశైలం వెళితే శారదాపీఠం ఆశ్రమంలోనే ఎస్ పి ఉండేవారని స్వరూపానందేంద్ర అన్నారు. గొప్ప ఆధ్యాత్మిక భావాలున్న సంగీత శిఖరం బాలసుబ్రహ్మణ్యం అని స్వరూపానందేంద్ర అన్నారు.
బాలు ఆత్మ భగవంతుని పాద చరణముల వద్దకు చేరాలని కోరుకుంటున్నానని స్వరూపానందేంద్ర అన్నారు.