కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ లో చేరిన వారిలో పీసీసీ కార్యదర్శి, పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటిసి రామూర్తి నాయుడు, బండపల్లి గ్రామ సర్పంచ్ రాజేశ్వరమ్మ, మండల కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు సరోజమ్మ, ఉపసర్పంచ్ ఆంజనేయులు, మాధరావుపల్లి గ్రామ నాయకులు నరసింహ ఉన్నారు.
వీరితో బాటు సుమారుగా 50 మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, TRS పార్టీ మండల అధ్యక్షుడు రాము యాదవ్, గూడెం సర్పంచ్ విష్ణు, నాయకులు అడ్వకేట్ రవి కుమార్, గాల్ రెడ్డి, వెంకటయ్య నాయుడు, దశరథం నాయుడు, తిరుపతయ్య నాయుడు, దేవేందర్ నాయుడు, నరసింహ, విండో డైరెక్టర్లు పాల్గొన్నారు.