కొల్లాపూర్ ఖాదర్ భాష దర్గా అభివృద్ధి కోసం జాతీయ మైనార్టీ,వక్స్ బోర్డ్ సభ్యులు హనీఫ్ అలినీ యండి.ఇమ్రాన్ ఖాన్ ఇదివరకు కలిసిన సంగతి తెలిసిందే. స్వయంగా జాతీయ వక్స్ బోర్డ్ మండలి సభ్యులు హనీఫ్ అలినీ కొల్లాపూర్ కు పిలిపించారు. ఖాదర్ పాషా దర్గా అభివృద్ధి కోసం ఇమ్రాన్ ఖాన్ ఏ విధంగా కృషి చేస్తున్నారో హనీఫ్ అలి కొల్లాపూర్ ముస్లిం పెద్దల సమక్షంలో వివరించి శాలువా కప్పి అభినందించారు.
దర్గా ను హనీఫ్ అలి పర్యవేక్షించిన సందర్భంలో ఇది జరిగింది. ఈ మధ్యలోనే దర్గా అభివృద్ధికి సంబంధించిన ప్రపోజల్ ను ఇమ్రాన్ ఖాన్ కేంద్రం దృష్టికి తీసుకు పోయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ మరో ముందడుగు వేశారు. కొల్లాపూర్ జమెయ్ మజీద్ కమిటీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలో ఇమ్రాన్ ఖాన్ పోటి చేయనున్నారు.
మస్జిద్ కమిటీ అధ్యక్ష ఎన్నిక కోసం ఇమ్రాన్ ఖాన్ నామినేషన్ వేశారు. పత్రాలను జామెయ్ మజీద్ కమిటీ ఎన్నికల పెద్ద సయ్యద్ ఖాదర్ కు సమర్పించారు. అనంతరం ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక నిధులు మంజూరు చేయించి కమిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు.