38.2 C
Hyderabad
April 29, 2024 20: 32 PM
Slider నల్గొండ

జనచైతన్య ట్రస్ట్ అధ్వర్యంలో రక్తదానం

#janachitanya

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని లోని ప్రయివేట్ హాస్పిటల్ లో గర్భిణీ మహిళకు డెలివరీ కొరకు ‘బి’ పాజిటివ్ రక్తం అవసరం అని జనచైతన్య ట్రస్ట్ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టగానే ట్రస్ట్ నిర్వాహకులు వంశీ,సాయి,శివశంకర్ లు తక్షణమే స్పందించి డోనార్స్ తో మాట్లాడి పంపిస్తాము అని తెలిపారు.

జన చైతన్య ట్రస్ట్ సభ్యుడు శివశంకర్ తన మిత్రుడు నాగుబండి ఉపేందర్ తో మాట్లాడి హాస్పిటల్ వద్దకు పంపించి ‘బి’ పాజిటివ్ రక్తదానం చేయడం చేశారు.సకాలంలో స్పందించి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన జనచైతన్య ట్రస్ట్ చైర్మన్,సభ్యులను పలువురు అభినందించారు.

జనచైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో 231వ వ్యక్తికి రక్తదానం చేసిన నాగుబండి ఉపేందర్ కి ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ మనమిచ్చే రక్తం వల్ల మరొకరి జీవితం నిలుస్తుందని, రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలని అన్నారు.రక్తం అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి జనచైతన్య బ్లడ్ డొనేషన్ టీం అన్ని వేళల అందుబాటులో ఉంటుందని అన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్:

Related posts

పరిషత్ పోలింగ్ ను పరిశీలిస్తున్నడీఐజీ..!

Satyam NEWS

కరోనా కట్టడికి అందరూ కలసి రావాలి

Satyam NEWS

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత: వైసీపీ నేత కొడుకు అరెస్టు

Satyam NEWS

Leave a Comment