నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ మార్కెట్ యార్డ్ చైర్మన్ జి. నరేందర్ రెడ్డి పదవీ కాలం అయిపోయినా కొనసాగుతున్నారా? మార్కెట్ యార్డు చైర్మన్ గా ఆయనను నియమించిన జీవో ప్రకారం గడువు తేది అయిపోనట్లుగా తెలిసింది.
అయినా సరే ఆయన కొనసాగుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై అధికారులు వివరణ ఇలా ఉంది. కమిషనర్ పంపిన జీవో కాఫీ ప్రకారం అక్టోబర్ పదోవ తేదీ వరకే జీవోలో వునట్లు చెబుతున్నారు.
అయితే ఆయన పదవీ స్వీకారం తేదీ ప్రకారం ఇంకా గడువు ముగియలేదని అధికారులు అంటున్నారు. జీవోలో పేర్కొన్న తేదీ కాకుండా ప్రమాణ స్వీకారం తేదీని అధికారులు పరిగణనలోకి తీసుకోవడం ఎవరి వత్తిడి వల్ల జరిగిందో తెలియడం లేదు.
జీవో విషయాన్ని, ప్రమాణ స్వీకార తేదీని చెబుతూ దీనిపై ముందుగానే కమిషనర్ కు లేఖ రాశారని తెలిసింది. అయితే ఇంతవరకు కమిషనర్ నుండి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కొనసాగాలా, అదేవిధంగా పదవి కాలం అయిపోయిందా అనే క్లారిటీ రాలేదు.
ఉన్నతాధికారుల నుంచి వివరణ రాకపోయినా ఆయన పదవిలో కొనసాగడమే ఇప్పుడు చర్చనీయాంశం అయింది. దీనిపై జి.నరేందర్ రెడ్డి వివరణ ఇలా ఉంది.
చైర్మన్ గా కొనసాగిన ఏడాది తర్వాత ఆరు నెలలకు ఒకసారి పొడిగించినట్లు తెలిపారు. మొత్తానికి సోమవారం వరకు రెండేండ్లు అయింది అని అన్నారు. ఆదివారం వరకు జీవో లో వున్నది. అయితే మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నవంబర్ 2వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు.
ఈ అంశం పై కమిషనర్ నుండి నాలుగైదు రోజుల్లో వివరణ మెసేజ్ వస్తుందని చెబుతున్నారు. అయితే ఇంకా ఎప్పటి వరకు జి.నరేందర్ రెడ్డి ని కొనసాగిస్తారో కమిషనర్ నుండి ఎప్పుడు మేస్సేజ్ వస్తుందో తెలియాల్సి వుంది. మెస్సెజ్ వచ్చాక నేనే చెబుతాను అని జి.నరేందర్ రెడ్డి అంటున్నారు.