ఉప్పల్ మెయిన్ రోడ్ లోనీ గాంధీబొమ్మ సమీపంలో మహావీర్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్వాహకుడు హరినాథ్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర రెడ్డి, మేకల మధుసూదన్ రెడ్డి, ఐకాన్ మోహన్ రెడ్డి, ఉప్పల్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేముల సంతోష్ రెడ్డి పంగ మహేందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, మల్లేష్, జగన్, సూరం శంకర్, వి బి నరసింహ టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.