ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన కొల్లాపూర్ శైలజ గన్ శ్యామ్ దంపతుల పుత్రిక ( రిటైర్డ్ ఉపాధ్యాయుడు దశరథ్ సింగ్ మనవరాలు) అన్నపూర్ణ గత రెండు రోజుల క్రితం లండన్ లో అవార్డు అందుకుంది. గత ఎడాది ఉన్నత చదువులకై అన్న పూర్ణ లండన్ కు వెళ్ళింది. అక్కడ MSc Cancer Biology చదువుతుంది.
ఈ ఏడాది ఇనిస్టిట్యూట్లో అవార్డులు ప్రకటించారు.Essex Cancer Research అవార్డు మూడవ స్థానంలో భారతీయ విద్యార్థిని అన్నపూర్ణా కు లభించింది.మొదటి స్థానం US విద్యార్థికి,రెండవ స్థానంలో బ్రిటన్ విద్యార్థి నిలిచారు.
భారతీయ విద్యార్థి అన్నపూర్ణ మూడో స్థానంలో నిలిచి అవార్డు తీసుకోవడంతో కొల్లాపూర్ లో తల్లి తండ్రులు బంధుమిత్రులు సొంతోషం వ్యక్తం చేస్తున్నారు.అదే విధంగా అన్నపూర్ణకు మిత్రులు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు.
అవుట రాజశేఖర్, సత్యం న్యూస్. నెట్, కొల్లాపూర్