రాష్ట్రంలో సీఎం జగన్ మైనార్టీ ల కోసం అమలు చేస్తున్న దుల్హన్ పధకం… పూర్తిగా మైనార్టీ లను అణగదొక్కేలా అమలవబోతోందని టీడీపీ మైనారిటీ సెల్ ఆరోపించింది. విజయనగరం అశోక్ బంగ్లాలో మీడియా తో ఆ పార్టీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖాదర్ భాష మాట్లాడుతూ దుల్హన్ పధక అమలులో కొత్త కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం 15 వేల సేలరీ అని కనీసం టెన్త్ పాస్ అవ్వాలని ఇలా పిచ్చి పిచ్చి రూల్స్ తీసుకొస్తోందని మండిపడ్డారు. చంద్ర బాబు హాయాంలో ఇలాంటి నిబంధనలు లేకుండానే మైనారిటీ లకు పధకాలు అందేవన్నారు. సీఎం జిల్లా ల పర్యటన లో డాగ్ స్వ్కాడ్ కు 25 వేలు ఇస్తున్నారని…అంతకంటే హీనంగా సీఎం జగన్ కు మైనారిటీ లు కనిపిస్తున్నారా అంటూ టీడీపీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖాదర్ బాష ఆవేదన వ్యక్తం చేసారు.
తక్షణమే తమకు ఇస్తున్న పధకం లో కఠినమైన నిబంధనలు సరళతరం చేసిన ఇవ్వాలన్నారు. గడచిన ఈ మూడేళ్ళ ఇవ్వని ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న తరుణంలో ఇలాంటి నిబంధనలు పెట్టడం సమ్మతం కాదన్నారు. తక్షణమే వాటిని రద్దు చేసి మైనారిటీ లకు అందజేసే పధకం.. సక్రమంగా సకాలంలో సరళతరం చేసి అందివ్వకపోతే..మా తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.