పెంచిన ఆర్టీసీ చార్జీల ధరలకు వ్యతిరేకంగా విజయనగరం జిల్లా లో టీడీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆ పార్టీ నగర శాఖ నేతలైన ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్ తో పాటు కనకల తదితరులు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్..ఇన్ గేట్ వద్ద దాదాపు రెండు గంటలకు పైగ నిరసనలు వ్యక్తం చేశారు.”బాదుడే బాదుడు” కార్యక్రమానికి నాంది పలికిన జగన్ ప్రభుత్వం.. తాజాగా ఆర్టీసీ చార్జీల పెంపు పై పడిందన్నారు. అసలు ఈ ప్రభుత్వానికి సక్రమంగా పరిపాలించే ఆలోచన లేదని ధ్వజమెత్తారు. కరోన ఇలా తగ్గిందో లేదో.. ఇక అటు సెస్స్ చార్జీలు.. ఇటు మిగిలిన వాటి ధరలు పెంచుతూ.. ఆదాయ మార్గాలను అన్వేషించే పని లి ఉంటోంది టీడీపీ విమర్శించింది.ఈ క్రమంలో నే బాదుడే బాదుడు కార్యక్రమం రూపేణా టీడీపీ ఆందోళనలు చేపడుతోందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు.
previous post