సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్ కుమార్ సతీమణి స్రవంతిని నియమించారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటునాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన యారాల రామిరెడ్డి డైరెక్టర్లుగా ఇమ్మడి సోమనసయ్య సామా ఆంజనేయులు. మంచినీళ్ల మహేందర్. జటంగి నరసయ్య నల్లగంటి మల్లయ్య కూడా ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గ చైర్మన్ తో పాటు చైర్మన్ డైరెక్టర్ల ను ఎమ్మెల్యే అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం రైతుల సమస్యల కోసం సమన్వయంతో పనిచేసే మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు కు కృషి చేయాలని కోరారు.