కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జి చిన్నారెడ్డి కి నష్టం జరగకుండా ఉండాలని, ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకున్నానని తన అనుచరులకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పూర్తి అయినందున తాను నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలో ఆయన బిజెపిలో చేరతారని అంటున్నారు.