కడప ఉభయ జిల్లాలోని ఒంటిమిట్ట, నందలూరు పోలీస్ స్టేషన్లను మంగళవారం కర్నూల్ రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ తనిఖీ చేసినారు. ఆయనకు పోలీస్ సిబ్బంది గౌరవ వందనంతో స్వాగతం పలికినారు. ఈ సందర్భంగా నందలూరు పోలీస్ స్టేషన్లో కర్నూల్ రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ తరచూ ఇటువంటి సాధారణ తనిఖీలు నిర్వహిస్తుంటా మన్నారు. కేసుల సత్వర పరిష్కరింప బడుతున్నాయా లేదా, పోలీసుల పనితీరు పై సమీక్షిస్తామని తెలిపారు.
ఈ మండలాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాను మరింత ప్రతిష్టంగా నిఘా ఏర్పాటు చేసి అరికడతామని తెలిపారు. పోలీస్ వ్యవస్థను మరింత మెరుగు పరుస్తామని,మహిళా పోలీసులతో గ్రామీణ ప్రాంతాల్లో మహిళల పట్ల జరిగే సమస్యలను సేకరించి పరిషరిస్తామని అన్నారు. పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసే మహిళల పట్ల వ్యవ హరించ వలసిన వైఖరిపై పోలీసులకు సూచనలు ఇచ్చామని వెల్లడించారు. కాగా పోలీస్ స్టేషన్లో రికార్డుల ను పరిశీలించి తగు సూచనలు డీఐజీ సెంథిల్ కుమార్ ఇచ్చారు.ఆయన వెంట కడప, అన్నమయ్య జిల్లా లా ఎస్పీలు,డీఎస్పీ లు,సి.ఐ లు,ఎస్సై లు పాల్గొన్నారు.