29.7 C
Hyderabad
May 4, 2024 04: 35 AM
Slider ముఖ్యంశాలు

కేసీఆర్ ను కలిసిన కూసుకుంట్ల

#kcr

మునుగోడు అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి  సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తనకు అవకాశమిచ్చి తన విజయానికి కారణమైనందుకు సిఎం కెసిఆర్ కి  కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల కు శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్ శాలువాతో ఆయనను సత్కరించారు. మునుగోడు అభ్యర్థి విజయం కోసం కృషి చేసినందుకు పార్టీ నేతలను సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా అభినందించారు. పార్టీ మీద, నాయకత్వం మీద విశ్వాసంతో  మునుగోడు ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారని సిఎం పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యాచరణలో పెట్టేందుకు పూనుకోవాలని సిఎం కెసిఆర్ సూచించారు.

సంబంధిత శాఖల మంత్రులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని సిఎం కెసిఆర్ ఆదేశించారు. సిఎం ను కలిసిన వారిలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, గాదరి కిశోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గొంగిడి సునిత మహేందర్ రెడ్డి ,  ఆశన్నగారి జీవన్ రెడ్డి, పైల్ల శేఖర్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, నల్లమోతు భాస్కర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, ఎం.సి.కోటిరెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు సోమా భరత్ కుమార్, ఉమా మాధవరెడ్డి , చాడా కిషన్ రెడ్డి, వేంరెడ్డి నర్సింహారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్ , మేడె రాజీవ్ సాగర్, యాదాద్రి – భువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి , జిల్లా శంకర్ తదితరులున్నారు.

Related posts

భ‌వానీ మాలధారులు బెజ‌వాడ‌కు వెళ్ల‌కుండానే “అమ్మ”‌ ద‌ర్శ‌నం

Satyam NEWS

విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ప్రశ్నపత్రాలను రూపొందించాలి

Satyam NEWS

ఐదుగురు భార్యల ముద్దుల మొగుడు ఏం చేస్తాడు?

Satyam NEWS

Leave a Comment