బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మవెంకట్ రెడ్డి జిహెచ్ఎంసి ఏ.ఈ ఫరీద్ ఖాన్ తో కలిసి కురుమ బస్తీలో సీ.సీ ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బి.పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ డ్రైనేజీ పనులు పూర్తి అయిన తర్వాత అనేక రోజుల తర్వాత వేస్తున్న సీ.సీ ప్యాచ్ వర్క్ పనులను సరైన పద్ధతిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేయాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి ఇన్చార్జ్ వెంకట్ రెడ్డి, బిజెపి నాయకులు ప్రధాన కార్యదర్శి జమ్మి చెట్టు బాలరాజ్, అచ్చిని రమేష్, ఇమిడి అరేందర్, మిర్యాల శ్రీనివాస్, శ్రీహరి షరీఫ్, బాలకృష్ణ గౌడ్, జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ రవి నాయక్, రాఘవేంద్ర ఇంకా అనేకమంది పాల్గొన్నారు. సత్యం న్యూస్, అంబర్పేట
previous post
next post