33.2 C
Hyderabad
May 4, 2024 02: 19 AM
Slider ఆదిలాబాద్

కుంటాల, పోచ్చెర జలపాతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దండి

#soyam bapurao

మరో కాశ్మీరాన్ని తలపించే ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాలను పర్యాటకులను ఆకట్టుకునే విధంగా అభివృద్ధి పరచాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు.

గురువారం ఢిల్లీలో బిజెపి జిల్లా నాయకులు రమణ.. రాజు యాదవ్ ల తో కలిసి ఎంపీ సోయం బాపురావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు. 

ప్రకృతి సోయగాలతో పర్యాటకులను కనువిందు చేసే కుంటాల, పొచ్చెర, గాయత్రి, కనకాయి, జన్నారం, కడెం జలపాతాలను అభివృద్ధి పరచాలని వీటికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.

ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ సోయం బాబూరావు వివరించారు.

Related posts

ఆదరణ పని ముట్లు…. దాచారు… అమ్ముకున్నారు

Satyam NEWS

వైయస్ షర్మిలకు 2+2 భద్రత పెంపు

Satyam NEWS

సత్తుపల్లిలో నూతన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల

Bhavani

Leave a Comment