38.2 C
Hyderabad
April 28, 2024 22: 43 PM
Slider కడప

వైయస్ షర్మిలకు 2+2 భద్రత పెంపు

#yssharmila

పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అభ్యర్థన మేరకు రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూ రిటీ నుండి టూ ప్లస్ టూ గా పెంచడం జరిగిందని కడప జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ తెలిపారు. భద్రతా ప్రమాణాల నిబంధనల స్కేల్ మేరకు భద్రతా కల్పించడం జరిగిందని ఎస్.పి వివరించారు. ఎవరైనా వ్యక్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వారికి గన్ మెన్లను కేటాయించమని ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చే సిఫారసు సెక్యూరిటీ రివ్యూ కమిటీ నివేదిక మేరకు గన్ మెన్లను కేటాయించడం జరుగుతుందని జిల్లా ఎస్.పి వివరించారు. కాగా వైయస్ షర్మిల రెండు రోజుల క్రితం తనకు భద్రత కల్పించాలని బహిరంగం గానే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పీసీసీ అధ్యక్షురాలు హోదాలో పర్యటిస్తున్నారు. దీంతో స్థానికంగా ప్రోటోకాల్ అంశాలను పరిగణలోకి తీసుకొని భద్రత ఏర్పాటు చేయడంతో పాటు వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూరిటీ నుండి టూ ప్లస్ టూ గా పెంచడం జరిగిందని కడప జిల్లా ఎస్పీ తెలిపారు.

Related posts

ఆంధ్రా -ఒడిశా స‌రిహ‌ద్దులో ఇద్దరు మావోల ఎన్ కౌంటర్

Satyam NEWS

పాత లిఫ్టుల ఆధునీకరణ, కొత్త లిఫ్టులు మంజూరుకు అభినందనలు

Satyam NEWS

రాత్రి పూట అడ్డంగా దొరికిన మందు బాబు లు…!

Satyam NEWS

Leave a Comment