28.7 C
Hyderabad
May 6, 2024 00: 05 AM
Slider ముఖ్యంశాలు

అమరావతి రైతులకు మద్దతుగా కువైట్ తెలుగు పరిరక్షణ ఆందోళన

#KuwaitTeluguAssociation

అమరావతి రాజధాని రైతులకు మద్ధతుగా కువైట్ లో గురువారం ఆందోళన నిర్వహించినట్లు కువైట్ తెలుగు పరిరక్షణ సమితి నాయకులు ఓలేటి దివాకర్ తెలిపారు.

అనంతరం రాజధాని రైతులు 254వ రోజులుగా చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు.  అమరావతి జేఏసీకి అన్ని వేళలా తమ సంపూర్ణ మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు.

రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.  త్వరలోనే అమరావతిలో పర్యటించి రైతులు చేస్తున్న పోరాటానికి మద్ధతు తెలుపుతామని ప్రకటించారు.

రాజధాని కోసం ఉచితంగా భూములిచ్చిన రైతులను ప్రభుత్వం కన్నీరు పెట్టిస్తోందని  ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు రావాలంటే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సూచించారు.

దేశానికి అన్నం పెట్టే రైతులతో కన్నీరు పెట్టించడం రాష్ట్రానికి మంచిదికాదని పేర్కొన్నారు. పెన్షన్ అడిగిన మహిళలను కాళ్లతో తన్నడం  బాధాకరమని తెలిపారు.

Related posts

విజయనగరం లో రాత్రి పూట జరిగిన ప్రమాదం.. ఎంతమందంటే…!

Satyam NEWS

పీఆర్టీయూ టీఎస్ డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Satyam NEWS

ధర్మారెడ్డి కుమారుడు మృతి

Murali Krishna

Leave a Comment