కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రం లో విషాదం చోటు చేసుకుంది. మూడేళ్ల కూతురుతో సహా తల్లి ఆత్మహత్య చేకోవడం సంచలనం కలిగించింది.
స్థానికంగా ఒక బావిలో తల్లి కూతుళ్ళ శవాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తల్లీ కుమార్తెల మరణానికి కుటుంబ కలహాలే కారణమని స్థానికులు అంటున్నారు. పూర్వాపరాలు విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.