మానవ సేవయే మాధవసేవ అని మహాత్మా గాంధీ పేర్కొన్నారు. అదే బాటలో తలకొండపల్లి జెడ్ పి టి సి ఉప్పల వెంకటేష్ ఉప్పల ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా గురువారం కడ్తల్ మండల్ ఎక్కువయి పల్లి గ్రామంలో ట్రస్ట్ ద్వారా కరోనా నిర్ధారణ బాధితులకు ఐదుగురికి హోమ్ ఐసోలేషన్ కిట్లు ఉప్పల వెంకటేష్ సహకారంతో ఎంపీపీ పాలకూర బుగ్గే గౌడ్ పెద్ద కుమారుడు పాలకుర్ల కరుణాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఉచిత పంపిణీ చేశారు.
అదేవిధంగా తలకొండపల్లి మండలంలోని గట్టుఇప్పలపల్లి , వెంకట్రావు పేట గ్రామంలో బుధవారం ముగ్గురు కి కరోనా పాజిటివ్ రావడంతో బాధితులను కలిసి కిట్టును అందజేశారు. మార్చాల గ్రామంలోని 4వ వార్డులో మస్కులు శానిటైజర్స్ ను పంపిణీ చేశారు.
కేశంపెట్ మండలంలోని గాంధీ శంకర్ పల్లి గ్రామంలో ఒకే కుటుంబానికీ కరోనా పాజిటివ్ రావడంతో వారికి, వెల్దండ మండల్ కొట్ర గ్రామంలో సుమారుగా పది మంది కరోనా సోకిన బాధితులకు హోమ్ ఐసోలేషన్ కిట్లు 14 రోజులకు సరిపడా మందులు పూరి రమేష్ ద్వారా అందించారు.
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం
తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో ఆయిల్ ముత్యాలమ్మ అనారోగ్యంతో మరణించింది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ కు తెలియజేయడంతో వెంటేనే స్పందించిన జడ్పిటిసి స్థానిక ఎంపీటీసీ సభ్యులు అంబాజీ గ్రామ ఉపసర్పంచ్ అజీజ్ ద్వారా మృతురాలి కుటుంబ సభ్యులకు 3000 ఆర్థిక సహాయం చేశారు.