32.7 C
Hyderabad
April 27, 2024 01: 59 AM
Slider ముఖ్యంశాలు

ధర్మారెడ్డి కుమారుడు మృతి

#ttdeo

టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి ఇంట విషాదం నెలకొంది. ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మూడు రోజులుగా చెన్నై లోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చేందినట్లు ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. గత ఆదివారం మధ్యాహ్నం చంద్రమౌళి చెన్నైలో గుండెపోటుకు గురి కావడంతో కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందతూ విషమ పరిస్ధితిలో ఉన్నారు. అయితే కావేరి ఆసుపత్రి వైద్యులు చంద్రమౌళిని బ్రతికించేందుకు కృషి చేసినప్పటికీ ఆయన అవయవాలు వైద్యంకు సహకరించక పోవడంతో బుధవారం ఉదయం చంద్రమౌళి తుది శ్వాస విడిచారు. ఇటీవల్ల టిటిడి పాలక మండలి సభ్యులు, చెన్నై పారిశ్రామికవేత్త అయినా ఏజే.శేఖర్ రెడ్డి కుమార్తెతో నిశ్చితార్థం అయ్యింది.  జనవరి  26వ తేదీన వీరి వివాహం తిరుమలలోని శృంగేరి మఠంలో వివాహం జరగాల్సి ఉంది.  ఇప్పటికే ఇరుకుటుంబాలు వివాహ ఏర్పాట్లల్లో నిమగ్నం అయ్యి, శుభలేఖలను సైతం పంచతున్నారు. ఈ క్రమంలోనే టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి దంపతులు హైదరాబాదులోని తమ బంధువులకు వివాహ పత్రికలు అందించేందుకు వెళ్ళగా  చంద్రమౌళి చెన్నైలోని ఆళ్వారుపేటలోని బంధువులకు వివాహ పత్రికలు ఇచ్చేందుకు వెళ్ళారు.  

ఆదివారం మధ్యాహ్నం చంద్రమౌళికి గుండెపోటు రావడంతో అతని స్నేహితులు దగ్గర లోని కావేరి ఆసుపత్రి తరలించి చిమిత్స అందించారు. విషయం తెలుసుకున్న టిటిడి ఈవో దంపతులు హైదరాబాదు నుండి నేరుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రిలో ఉన్న కుమారుడిని చూసి కన్నీ పర్యంతం అయ్యారు.  గత మూడు రోజులుగా మృత్యువుతో పోరాడిన చంద్రమౌళి బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. కళ్ళ ముందే కొడుకు మృతి చేందడంతో ధర్మారెడ్డి దంపతులు తీవ్ర శోక సంద్రంలో నిండి పోయారు. చంద్రమౌళి పార్ధివ దేహాన్ని కర్నూలు కు తీసుకెళ్ళి ధర్మారెడ్డి సొంత గ్రామంలో అంత్యక్రియలు చేయనున్నారు.

Related posts

అణగదొక్కాలని చూస్తే ఇంకా పైకి లేస్తాం

Satyam NEWS

జాతీయ మాస్టర్స్ క్రీడల్లో 5 పతకాలు సాధించిన 55 ఏళ్ల  హెచ్.సి

Satyam NEWS

కార్తికేయ ‘బెదురులంక 2012’ ఫస్ట్ లుక్ విడుదల

Bhavani

Leave a Comment