వచ్చే నెల 1వ తేదీన రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తున్న ఖమ్మం లకారం మినీ ట్యాంక్ బండ్ పనులను నేడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం లకారం మినీ ట్యాంక్ బండ్ పనులను రూ. 1.50 కోట్లతో చేపడుతున్న విషయం తెలిసిందే. లకారం మినీ ట్యాంక్ బండ్ పనులను మంత్రి పరిశీలించినప్పుడు ఆయన వెంట మేయర్ పాపాలాల్, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు ఉన్నారు.
previous post