30.7 C
Hyderabad
April 29, 2024 03: 12 AM
Slider నల్గొండ

ప్రతిభ చూపిన విద్యార్ధినిని అభినందించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

#mlasaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండలం కేంద్రానికి చెందిన లక్ష్మీ చక్రారెడ్డి మనుమరాలు శ్రీవహిణి రెడ్డి ఇటీవల జరిగిన కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించిన సందర్భంగా శనివారం స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో విద్యార్థినిని మనస్ఫూర్తిగా అభినందించారు.

ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ విద్యార్ధులు కృషితో, పట్టుదలతో విజయాలను సాధిస్తూ కన్న తల్లిదండ్రులకు,గ్రామాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధినీ కుటుంబ సభ్యులు,టిఆర్ఎస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ‌సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఘనంగా కాటమయ్య పండుగ

Bhavani

లింగ నిర్ధారణ పరీక్షలు నేరం, అతిక్రమిస్తే కఠిన చర్యలు

Satyam NEWS

డాక్టర్లూ మధుమేహంపై దృష్టి సారించండి

Satyam NEWS

Leave a Comment